బీఆర్‌ఎస్ పవర్‌లోకి వస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ జాతీయం. కేసిఆర్

*ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ ముఖ్యంశాలు:-*

*బీఆర్ఎస్ వస్తే దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్.. ఖమ్మం గుమ్మంలో కేసీఆర్ కీలక ప్రకటన..*

*బీఆర్‌ఎస్ పవర్‌లోకి వస్తే మళ్లీ జాతీయం..*

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం అమ్మేసినా బీఆర్‌ఎస్ పవర్‌లోకి వస్తే మళ్లీ జాతీయం చేస్తుందన్నారు కేసీఆర్.

*75ఏళ్ల స్వాతంత్ర్య భారత్‌లో విషపు మంచినీళ్లే.. – సీఎం కేసీఆర్*

75ఏళ్ల స్వాతంత్ర్య భారత్‌లో ఇప్పటికీ చాలాచోట్ల విషపు మంచినీళ్లే ఉన్నాయన్నారు. దేశం లక్ష్యం కోల్పోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. నీళ్ల విషయంలో ట్రెబ్యునళ్ల ఏర్పాట్లపైనా కేసీఆర్ ఘాటుగా స్పందిచారు. ఉలుకూపలుకులేని ట్రెబ్యునళ్లతో ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు అని ప్రశ్నించారు. సాగుకు ఆమోదయోగ్యమైన భూమి ఉంది. నీరుంది. వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ వాడుకునే తెలివి కేంద్రంలోని ప్రభుత్వాలకు లేకపోయిందని విమర్శించారు కేసీఆర్.

*బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..*

ప్రస్తుతం దేశమంతటా కరెంట్ కష్టాలు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. ఒక్క తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కోతలేనని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. 2 ఏళ్లలోనే వెలుగు జిలుగుల భారతాన్ని ఆవిష్కరిస్తామన్నారు. అలాగే రైతులకు కూడా ఉచిత కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. కేంద్రం ఏటా 25 లక్షల మందికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లకు చేతకాకపోతే.. తమ ప్రభుత్వం వచ్చాక చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.

*బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్.. – సీఎం కేసీఆర్*

బీజేపీది ప్రైవేటైజేషన్ విధానమైతే.. బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్ విధానమన్నారు. ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటిని తిరిగి మళ్లీ జాతీయకరణ చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌.

*బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ..! – కేసీఆర్*

2 ఏళ్లలోనే వెలుగు జిలుగుల భారతం
రైతులకు ఉచిత కరెంట్
దేశవ్యాప్తంగా రైతుబంధు
LICని జాతీయం చేస్తాం
పబ్లిక్‌ సెక్టార్‌లోనే కరెంట్‌ రంగం
ఏటా 25 లక్షల మందికి దళితబంధు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
విశాఖ ఉక్కు జాతీయం
దేశ వ్యాప్తంగా మిషన్‌ భగీరథ
అగ్నిపథ్‌ను రద్దు

*దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం – సీఎం కేసీఆర్‌*

దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందన్నారు. అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉంది. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని విమర్శించారు.

*ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు..*

ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.

*ప్రపంచానికి ఫుడ్‌చైన్ అందించాం..*

మనం మాత్రం మెక్‌డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం..
దేశంలో అపార జల సంపద ఉంది.. భూమి ఉంది.. నీరు ఉంది. యాపిల్‌తోపాటు మామిడి కూడా పండుతుంది. మన దేశం ప్రపంచానికి ఫుడ్‌చైన్‌గా ఉండాలి. కానీ మనం మెక్‌డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నాం. ఫామ్‌అయిల్‌ను కూడా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకింది. మన దేశం లక్ష్యాన్ని కోల్పిందని ఆవేదన వ్యక్తం చేశారు.

*భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా..? – సీఎం కేసీఆర్*

బీఆర్ఎస్ జాతీయ పాలసీ, వైఖరి సమగ్రంగా వెల్లడిస్తాం. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా..? అంటూ ప్రశ్నించారు. లక్షల కోట్ల ఆస్తి మన దేశం సొత్తు.. కానీ ఇంకా యాచకులుగానే ఎందుకు ఉండిపోయాం..? ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతం అని అన్నారు.

*ఖమ్మం జిల్లాకు కేసీఆర్ వరాలు..*

ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు వరాలు కురిపించారు. ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు వరాలు కురిపించారు. ఖమ్మం జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలకు రూ.10 కోట్లు.. ఇతర మున్సిపాల్టీలకు రూ.30 కోట్లు కేటాయిస్తున్నాం.

Leave A Reply

Your email address will not be published.